|

07 March 2016
Hyderabad
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగు టెలివిజన్ రంగంలో విశేష ప్రతిభ కనబరుస్తున్న మహిళలకు తెలుగు టెలివిజన్ రచయితల సంఘం బుల్లితెర మహిళా శిరోమణి అవార్డులు ప్రదానం చేసింది. ఈ కార్యక్రమం ఫిలింఛాంబర్ లో జరిగింది. కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ ముఖ్య సలహాదారు కెవి.రమణాచారి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి హాజరయ్యారు. 20 మంది మహిళలకు పురస్కారాలు అందచేశారు. రచయిత్రులు కందాల ఉషారాణి, బలభద్రపాత్రుని రమణి, అయినంపూడి శ్రీలక్ష్మీ, బాల త్రిపురసుందరి, రాధా ప్రశాంతి, నటీమణులు రాగిణి, నవీన యాటా, రాధికా ప్రశాంతి, శృతి, నిర్మాత కొడాలి అనిత, రిజ్వానా మహతి, న్యూస్ రీడర్లు దేసాయి శ్రీదేవి, దీప్తి వాజ్ పాయ్, నెల్లుట్ల కవిత, చిత్రలేఖ, మంగ్లి సత్యవతి, తీన్ మార్ సావిత్రి కె.శివజ్యోతి అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలను సన్మానించారు.

|
Photo
Gallery (photos by G Narasaiah) |
|
|
|
|
|